Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఓపెన్ వర్శిటీ స్టడీ సెంటర్లు కొనసాగించాల్సిందే : హైకోర్టు

ఏపీలో ఓపెన్ వర్శిటీ స్టడీ సెంటర్లు కొనసాగించాల్సిందే : హైకోర్టు
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:47 IST)
అంబేద్కర్, తెలుగు సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు చెందిన స్టడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే సేవల నిర్వహణ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాలని శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
 
విద్యాసంస్థలకు సంబంధించి విభజన చట్ట ప్రకారం విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపీలో స్టడీ సెంటర్లు కొనసాగించడం వల్ల రూ.14 కోట్ల జీతాలు చెల్లించామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తే స్టడీ సెంటర్ల నిర్వహణకు ఇబ్బంది లేదని వెల్లడించారు. దీంతో హైకోర్టు ఆవిధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Share this Story:

Follow Webdunia telugu