Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా పేరు వింటేనే చంద్రబాబు ఫ్యాంటు తడిసిపోతోంది : అంబటి రాంబాబు

రోజా పేరు వింటేనే చంద్రబాబు ఫ్యాంటు తడిసిపోతోంది : అంబటి రాంబాబు
, శుక్రవారం, 18 మార్చి 2016 (14:30 IST)
తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే. రోజా పేరు వింటేనే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాంటు తడిసిపోతోందని, అందుకే ఆమె అంటు ఆయన వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేసిన తర్వాత కూడా ఆమెను సభలోకి అడుగుపెట్టనీయకుండా చంద్రబాబు సర్కారు అడ్డుకున్న తీరు జుగుత్సాకరంగా ఉందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికృతరూపం ఎలా ఉంటుందో రోజా సస్పెన్షన్ ఘటన చూసి ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. వాస్తవానికి శాసనవ్యవస్థ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం కూడదని ఎప్పటినుంచో అంటున్నారని, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా సస్పెండ్ చేసినప్పుడు కోర్టులు చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని తీర్పులిచ్చాయని, వాటిని సభలు కూడా ఆమోదించాయని అంబటి గుర్తు చేశారు. 
 
కోర్టు ఆదేశాల అనంతరం సభకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చిన రోజాను అడ్డుకోవడంపట్ల ఆయన స్పందిస్తూ ప్రతిపక్షంపై చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కోర్టులు తీర్పులు ఇచ్చాయని, వాటిని సభలు గౌరవించాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం స్పీకర్, ముఖ్యమంత్రి మాత్రం వాటిని గౌరవించడం లేదని, వ్యక్తిగత కక్షను పెంచుకున్నారని మండిపడ్డారు.  
 
ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇంతలా చంద్రబాబు కక్ష కట్టడానిక కారణం ఎంటో తెలియదన్నారు. గతంలోనూ సీఎంగా, ప్రతిపక్షనేతగా వ్యవహరించిన వ్యక్తి విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వాదనాలు విన్న తర్వాతే న్యాయమూర్తి తన ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని గౌరవించాలని అంబటి రాంబాబు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu