Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం: అఖిల ప్రియ ఒక్కరే బరిలో!

ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం: అఖిల ప్రియ ఒక్కరే బరిలో!
, శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:08 IST)
ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి అఖిల ప్రియ ఒక్కరే బరిలో మిగిలారు. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలవగా, వాటిలో నాలుగింటిని అధికారులు తిరస్కరించారు. 
 
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అఖిల ప్రియ ఒక్కరే బరిలో మిగిలారు. దీంతో అఖిల ప్రియ ఆళ్లగడ్డలో ఎంపిక కావడం ఏకగ్రీవమైంది.
 
కాగా, మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అకాల మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉపఎన్నికలో అభ్యర్థులను నిలపరాదని అధికార టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎంపిక కాని పక్షంలో వచ్చే నెల 8న ఆ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu