Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణాజిల్లాలో దారుణం : అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త!

కృష్ణాజిల్లాలో దారుణం : అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:00 IST)
భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లాలోని బందరు మండలం కరగ్రహారం గ్రామంలో ఈ దారుణం జరిగింది.
 
జొన్నలవారిమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగేశ్వరరావు, కరగ్రహారం గ్రామానికి చెందిన భూలక్ష్మికి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని నెలలుగా వీరు కరగ్రహారం గ్రామంలో నివసిస్తున్నారు. పెళ్ళయిన నాటి నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉండటం, భూలక్ష్మిపై నాగేశ్వరరావుకు అనుమానం ఉండటంతో వేధిస్తుండేవాడు.
 
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో నాగేశ్వరరావు కొబ్బరికాయలు నరికే కత్తితో భూలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu