Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏం... కష్టమొచ్చింది తల్లీ నీకు...? పిల్లలతో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నావే..!! ఎక్కడ?

ఏం... కష్టమొచ్చింది తల్లీ నీకు...? పిల్లలతో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నావే..!! ఎక్కడ?
, శనివారం, 1 ఆగస్టు 2015 (11:48 IST)
భర్తంటే ప్రాణం.. ఆమెకు.. ఆమె పిల్లలకు కూడా.. అతని ఆదరణ కోసం ప్రాకులాడారు. అయితే అతనిని నుంచి ఎటువంటి ఆదరణ లభించిలేదు. నిరాదరణే ఎదురయ్యింది. సంసారాన్ని గాలికొదిలేసి అప్పులు చేసి బలాదూర్ తిరగడమే అతని పని కావడంతో ఆ తల్లికి కష్ణమై పోయింది. దీంతో పిల్లలకు నిప్పంటించి, తాను కూడా నిప్పంటించుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. 
 
హైదరాబాద్‌ గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం జప్తిలింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నరేందర్‌ రెడ్డి, వినోద దంపతులు పదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గత వారం రోజులుగా భర్త ఇంటికి రావడంలేదని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వినోద సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వినోద పిల్లలు విఘ్నేష్‌ (7), జ్యోతి(8)లకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu