తూర్పుగోదావరి జిల్లా గొల్లపేటకు చెందిన తొమ్మిది మంది భక్తులు కాశీలో అదృశ్యమయ్యారు. వీరంతగా పది రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. అయితే, కాశీ నుంచి ఈ బృందంలో 9 మంది తప్పిపోయారని మిగతా యాత్రికులు పేర్కొంటున్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు.
భక్తుల అదృశ్యంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించి ఆచూకి కనుగొనాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అదృశ్యమైన వారి ఆచూకి కనుగొని వారిని తమ స్వస్థలానికి సురక్షితంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని చినరాజప్ప చెప్పారు.