Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తిలో ఆటో లారీ ఢీ.. ఏడుగురు మృతి

శ్రీకాళహస్తిలో ఆటో లారీ ఢీ.. ఏడుగురు మృతి
, గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:47 IST)
పట్నం వచ్చి పనులు చూసుకుని తిరిగి వారి వారి ఊళ్లకు వెళ్లే హడావుడీలో ఆటో లేదా జీపు ఏది దొరికితే దానిని పట్టుకుని ప్రయాణం చేయడం షరామామూలే. అయితే అదే వారి పాలిట శాపంగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. హృదయవిదారకమైన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన పల్లెల జనం సాధారణంగా శ్రీకాళహస్తి పట్టణానికి రావడం అవసరమైనవి కొనుగోలు చేసుకోవడం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతుంటారు. బుధవారం కూడా సరిగ్గా ఇలాగే కొంత మంది శ్రీకాళహస్తిలు తమ పనులు ముగించుకుని ఆటోలో సొంత ఊళ్ళకు బయలుదేరారు. అందులో అప్పటికే 15 ప్రయాణీకులు ఉన్నారు.
 
అయితే వారు ప్రయాణిస్తున్న ఆటోను తిమ్మ సముద్రం గ్రామం వద్దకు రాగానే వేగంగా వస్తున్న లారీ ఒకటి ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. వారులో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులోంచి మృతదేహాలను బయటకు లాగడానికి చుట్టుపక్కల పల్లెల జనంతోపాటు పోలీసులు కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. గాయపడ్డవారిని సమీపంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu