Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్

5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్
, శనివారం, 4 అక్టోబరు 2008 (11:45 IST)
ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చే ఆదివారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానాంశంగా చేసుకుని చేపట్టే ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో భేటీ కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించడంతో నేత కార్మికుల సమస్యలకు రాజకీయరంగు పులుముకుంది. దీనితో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కారానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ కారణంతోనే సీఎం ఢిల్లీ పయనమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. ఈ పర్యటనలో పీసీసీ కార్యవర్గం తుది కసరత్తుపై ముఖ్యమంత్రి మరోమారు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu