Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమికులు అక్కడికెళితే... ప్రియురాలు గ్యాంగ్ రేప్ ఖాయం... ఎక్కడది?

విజయవాడ పాయకాపురంలో ప్రేమజంటల నిలువుదోపిడీ, యువతులపై అత్యాచారం

ప్రేమికులు అక్కడికెళితే... ప్రియురాలు గ్యాంగ్ రేప్ ఖాయం... ఎక్కడది?
, బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (18:26 IST)
ప్రేమికులు ఎక్కడ కలుసుకుంటారు. సినిమా థియేటర్లు, పార్కులు ప్రైవసీకి కాస్త ఇబ్బందిగా ఉంటాయని జన సంచారం అంతగా లేని ప్రదేశాలను వెతుక్కుంటుంటారు. ఆ బలహీనతే కొన్ని ప్రేమజంటల పాలిట శాపమవుతోంది. ప్రేమ జంటల బలహీనతను అడ్డం పెట్టుకుని ఓ ముఠా దారుణాలకు పాల్పడుతోంది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు సమీపంలోని పాయకాపురంలో 200 ఎకరాల్లో ఓ సంస్థ వెంచర్ వేయగా అక్కడ చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 
 
విశాలమైన ప్రదేశం, అంతా నిర్జన ప్రదేశంగా ఉండటంతో ప్రేమపక్షులు అక్కడికి చేరుకోవడం ఎక్కువైంది. ఇలా వచ్చినవారిని వినోద్ కుమార్, నాగరాజు, దుర్గాప్రసాద్, మనోజ్ అనే నలుగురు యువకులు అటకాయించి బెదిరింపులకు దిగుతారు. విషయాన్ని వారి ఇళ్లలో చెబుతామని భయపెట్టడమే కాకుండా పోలీసులకు పట్టిస్తామని చెప్పడంతో ప్రేమికులు విషయం ఇంట్లో తెలిసిపోతుందని హడలిపోతారు. ఆ భయంలో వారు ఉండగా వారి వద్ద ఉన్న డబ్బు, నగలు అన్నీ దోచేసుకుంటారు. 
 
ఆ తర్వాత ప్రేమజంటలోని యువతిపై నలుగురూ అత్యాచారం చేస్తారు. ఇలా ఇప్పటివరకూ వారు 20 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐతే ఈ నలుగురి ముఠా పట్టుబడింది అక్కడ కాదు...  తాడేపల్లి సీతానగర్ లోని ఓ ఇంట్లో దోపిడీ చేసి ఆ తర్వాత ఆ ఇంటి యజమాని కుమార్తెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో పరారయినప్పటికీ పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. నలుగురినీ పట్టుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఈ దారుణాలను వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu