Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీనియర్ నక్సల్స్ అత్యాచారం చేశారు... పోలీసులకు మహిళా నక్సల్స్ ఫిర్యాదు

సీనియర్ నక్సల్స్ అత్యాచారం చేశారు... పోలీసులకు మహిళా నక్సల్స్ ఫిర్యాదు
, సోమవారం, 30 మే 2016 (09:53 IST)
తమపై సీనియర్ నక్సల్స్ అత్యాచారం చేసినట్లు ఇద్దరు మహిళా నక్సల్స్‌ పోలీసులకు ఆరోపించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 40 మంది తిరుగుబాటుదారుల్లో వీరు కూడా ఉన్నట్లు అధికారి ఒకరు చెప్పారు. స్థానిక కమాండర్ కటే కళ్యాణ్ గత కొంతకాలంగా తనపై అత్యాచారం చేస్తున్నట్లు 27 ఏళ్ల యువతి ఆరోపించింది. 
 
ఓ మహిళా నక్సలైట్ కూడా గర్భవతిగా ఉన్నట్లు తెలిపారు. బర్సూర్‌ ప్రాంతం మావోయిస్ట్‌ కమిటీ ఇంఛార్జ్‌ తనను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేస్తున్నట్టు మరో మహిళ ఫిర్యాదు చేసింది. గర్భనిరోధక ఇంజక్షన్లు ఇస్తూ తనపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిపింది. సీనియర్లు పెట్టే వేధింపులను భరించలేక జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో సూర్యుడి ప్రతాపం.. పదేళ్ళనాటి బండరాయి పగిలిపోయింది!