సీఎం కిరణ్ బ్రహ్మాస్త్రం విభజనను అడ్డుకోలేదు : గండ్ర
, సోమవారం, 3 ఫిబ్రవరి 2014 (11:36 IST)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రయోగించిన బ్రహ్మాస్త్రం రాష్ట్ర విభజనను అడ్డుకోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. ఎంపీ లగడపాటి రాజగోపాల్ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని, రాష్ట్ర విభజన తథ్యమని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీకి వచ్చి దీక్ష చేసినా, లగడపాటి పగటి వేషాలు వేసినా విభజన ఆగదని అభిప్రాయపడ్డారు. తమ దగ్గర చాలా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని లగడపాటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.