సీఎంగా ఎవరిని నియమించాలో వారికి తెలుసు: కేవీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసునని కేవీపీ బుధవారం ఢిల్లీలో తెలిపారు. ఢిల్లీలో బుధవారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్తో బేటీ అయిన అనంతరం కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మన్మోహన్సింగ్కు తాను వివరించానని, రాష్ట్ర పరిస్థితులను ఆయనకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. తమ భేటీలో ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న అనిశ్చితిపై పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉందని ఆయన తెలిపినట్లు కేవీపీ తెలిపారు.