Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుంది: వైఎస్ జగన్

వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుంది: వైఎస్ జగన్
FILE
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం మొగల్తూరులో పర్యటించారు. తొలుత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని చెప్పారు.

తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తుంటే తననే ప్రజలు ఓదార్చుతున్నారన్నారు. మీకు మేమున్నామంటూ మనోధైర్యాన్ని ఇస్తున్నారన్నారు. ఇంతటి ఆప్యాయతను తాను ఊహించలేదన్నారు.

తనకోసం ఇంతమంది ప్రజలు ఎదురుచూడటాన్ని చూస్తుంటే తన తండ్రి చనిపోయినట్లు అనిపించడం లేదనీ, ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికే ఉన్నాడనిపిస్తోందన్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ ఓదార్పు యాత్రకు ప్రజలు మండుటెండలను సైతం లెక్క చేయక భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu