రాష్ట్రంలో స్వైన్ఫ్లూ బారినపడి ఇద్దరి మృతి
రాష్ట్రంలోని విశాఖపట్టణంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో స్వైన్ఫ్లూ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్టణంలో ఇరవై నాలుగు గంటల్లోపు స్వైన్ఫ్లూ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి జె. సరోజిని తెలిపారు. ఇప్పటివరకు విశాఖలో స్వైన్ఫ్లూ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 19కి చేరుకుందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత విశాఖపట్టణంలో స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్తులున్నారన్నారు. తమ జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ఫ్లూ మహమ్మారి బారినపడినవారి సంఖ్య 1289కు చేరుకుందని ఆమె వివరించారు.