Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలసీమ పర్యటనకు ప్రజారాజ్యం సిద్ధం!

రాయలసీమ పర్యటనకు ప్రజారాజ్యం సిద్ధం!
ఉత్తరాంధ్ర, తెలంగాణా పర్యటనలు విజయవంతం కావడంతో సమరోత్సాహంలో ఉన్న ప్రజారాజ్యం.. అదే ఊపుతో రాయలసీమ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనకు ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేశారు. పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి రూటు మ్యాపు విడుదల కానున్న తరుణంలో కిరాయి హంతకుడు మొద్దుశీను హత్యతో ఆలస్యం కానుంది.

ప్రస్తుతం ఈ యాత్రను అనంతపురం - కర్నూలులో చేపట్టాలా? లేదా కర్నూలు - కడపల నుంచి చేపట్టాలా? అనే దానిపై పీఆర్పీ కసరత్తు చేస్తోంది. తొలుత రాయలసీమ యాత్రను అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే.. ఆ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా, పార్టీ అధినేత పర్యటనపై పార్టీ నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి పర్యటన వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu