Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా టెక్కీని హోటల్‌కు రప్పించుకుని నలుగురు గ్యాంగ్ రేప్!

మహిళా టెక్కీని హోటల్‌కు రప్పించుకుని నలుగురు గ్యాంగ్ రేప్!
, గురువారం, 8 ఆగస్టు 2013 (16:10 IST)
FILE
హైదరాబాద్ పరిసరాల్లోని శంషాబాద్‌లో ఓ మహిళా టెక్కీ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెపై నలుగురు కామాంధులు ప్లాన్ ప్రకారం గ్యాంగ్ రేప్ చేశారు. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి....

కూకట్‌పల్లికి చెందిన 27 ఏళ్ల యువతి తన భర్త నుండి విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. ఆమె మాదాపూర్‌లో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఇటీవలే ఆమెకు మాట్రిమోనియల్ ద్వారా శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

పెళ్లి విషయమై మాట్లాడటానికి ఆగస్టు 2వ తేదిన శంషాబాదులోని ఓ హోటల్లో బాధితురాలు, శ్రీకాంత్‌లు దిగారు. ఆ హోటల్‌కు శ్రీకాంత్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు. మొత్తం నలుగురు కలసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

సాయంత్రం ముడున్నర గంటలకు వచ్చిన వారు ఆ తర్వాత ఏడున్నర గంటలకు వరకూ ఆమెపై అత్యాచారం జరిపారు. ఆ తర్వాత మంగళవారం రోజు యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ప్రధాన నిందితుడుని అదుపులోకి తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu