మహిళాలోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళలకు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిపెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని మంత్రి ప్రశంసించారు. జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి అపర భగీరథుడిగా పేరొందిన సీఎం.. మహిళ అభ్యున్నతికి చేస్తున్న కృషి చారిత్రాత్మకమని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి ప్రసంగించారు. ఎవరూ ఊహించని విధంగా ఓ మహిళను హోంమంత్రిగా నియమించి మహిళల అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధిని చాటుకున్నారని సబితా రెడ్డి తెలిపారు.