Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం సిండికేట్లలో సీఎం వాటా ఎంతో తేల్చాలి: రాథోడ్

మద్యం సిండికేట్లలో సీఎం వాటా ఎంతో తేల్చాలి: రాథోడ్
, బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (16:50 IST)
మద్యం సిండికేట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వాటా ఎంతో తేల్చాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత బొత్స సత్యనారాయణ, మద్యం సిండికేట్లతో కుమ్మకై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రమేష్ మండిపడ్డారు.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దానిని నియంత్రించాల్సింది వదిలేసి మద్యం సిండికేట్లతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని రమేష్ రాథోడ్ విరుచుకుపడ్డారు. ఇంకా మద్యం సిండికేట్లపై దోపిడికి పాల్పడుతున్న వారిపై సీబీఐ దాడులు మరింత తీవ్రతరం చేయాలని రాథోడ్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu