Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి డీఎల్ చేసిన ఆరోపణలన్నీ నిజాలే : పీసీసీ చీఫ్ బొత్స

మంత్రి డీఎల్ చేసిన ఆరోపణలన్నీ నిజాలే : పీసీసీ చీఫ్ బొత్స
, గురువారం, 9 ఫిబ్రవరి 2012 (01:25 IST)
File
FILE
రాష్ట్ర మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి తాజాగా చేసిన ఆరోపణలన్నీ నిజాలేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి డీఎల్ శాఖల్లో ముఖ్యమంత్రి కోత విధించడం ఇపుడు పెద్ద చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

దీనిపై బొత్స స్పందిస్తూ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మీడియా ముందు చెప్పినవన్నీ నిజాలేనని, ఆయన చేసిన వాదనలో వాస్తవముందన్నారు. అయితే డీఎల్ రాజీనామా చేయనని చెప్పారని, ఇంతటితో ఈ సమస్య సమసిపోయినట్టేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ తప్పు చేసి ఉండరని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. మంత్రులు, ఐఏఎస్‌లు చట్టానికి అతీతులు కాదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu