Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రలోభ పెడితే ఒక్క సభ్యుడు ఉండరు : మంత్రి దానం నాగేందర్

ప్రలోభ పెడితే ఒక్క సభ్యుడు ఉండరు : మంత్రి దానం నాగేందర్
, శుక్రవారం, 9 డిశెంబరు 2011 (20:08 IST)
తమ ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం సమయంలో విపక్షాలకు చెందిన సభ్యులను ప్రలోభపెట్టివున్నట్టయితే ఒక్క సభ్యుడు కూడా మిగిలివుండరని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర విపక్షాల్లోని శాసనసభ్యులను మేం ప్రలోభ పెడితే ఎవరైనా ఆ పార్టీలో మిగులుతారా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. మేం అలా చేస్తే ఆయా పార్టీలో ఎవరూ మిగలరన్నారు. పార్టీ విప్ ధిక్కరించిన జగన్ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu