ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్తో కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. డీఎస్ నివాసంలో జరిగిన ఈ భేటీలో దాదాపు గంటసేపు వారిరువురు చర్చించుకున్నట్లు సమచారం.
జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపైనే ప్రధానంగా వారు చర్చించినట్లు సమాచారం. ఈ ఓదార్పు యాత్రవల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని జగన్ పేర్కొన్నట్లు తెలియవచ్చింది. వీరి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు.
ఇదిలావుండగా ఏప్రిల్ 9 నుంచి పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నట్లు జగన్ డీఎస్కు తెలిపారు. కాగా నగరంలో జరుగిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇరువురు కలిసి ఒకే కారులో వెళ్ళారు.