పయ్యావుల కేశవ్ : చిరంజీవి - కావూరి - లగడపాటిలపై ఫైర్
, సోమవారం, 5 ఆగస్టు 2013 (11:37 IST)
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులతో పాటు... విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు వారి వ్యాపారమే పరమావధిగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన సోమవారం టీడీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, కానీ, విభనజ విధానం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. పద్ధతి ప్రకారం విభజన జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందన్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.