Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను కూడా కేసీఆర్‌ను గాడిదపై ఊరేగించగలను: చిరు

నేను కూడా కేసీఆర్‌ను గాడిదపై ఊరేగించగలను: చిరు
WD
పోలవరం ప్రాజెక్టు కోసం ఉత్తరాంధ్రలో చేస్తున్న బస్సుయాత్రకు మధ్యలో కాస్త బ్రేక్ కొట్టిన చిరంజీవి పాయకరావుపేటలో ఓ 150 మీటర్లు మేర గుఱ్ఱపు స్వారీ చేశారు. ఈ గుఱ్ఱపు స్వారీని చూసిన అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట పరుగులు తీశారు.

చిరు గుఱ్ఱపు స్వారీని కించపరుస్తూ ఆదివారం తెలంగాణా ప్రాంతంలోని సిరిసిల్లలో కొందరు తెరాస కార్యకర్తలు చిరంజీవి డూప్‌తో గాడిదపై కూర్చోబెట్టి ఊరేగింపు చేశారు.

దీనిపై చిరంజీవిని కదిలిస్తే... తాను కూడా కేసీఆర్ డూప్‌ను గాడిదపై కూచోబెట్టగలననీ, అంతేకాదు అంతకంటే ఎక్కువే చేయగలననీ, అయితే తన మనస్తత్వం అటువంటిది కాదని అన్నారు. తనకు హుందాగా నడుచుకోవడం తప్పించి చవకబారుతనం చేష్టలు చేతకావని అన్నారు.

ఇలా ఎంతమంది ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా తన యాత్ర ఆగదనీ, త్వరలో తెలంగాణా ప్రాంతంలోనూ పర్యటిస్తానని చెప్పారు. తన యాత్రను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu