Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా ఉద్యమం: మరణించినవారు 22

తెలంగాణా ఉద్యమం: మరణించినవారు 22
ప్రత్యేక తెలంగాణాకోసం తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ దీక్షబూనిన నాటి నుంచి నేటివరకూ 22 మంది తమ ప్రాణాలను అర్పించారు. వీరిలో కొందరు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడాన్ని తట్టుకోలేక ప్రాణాలను బలి ఇవ్వగా మిగిలినవారు తమకు ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందేనంటూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మంగళవారం ఒకేరోజున కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ముగ్గురు తమ ప్రాణాలను అర్పించారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటకు చెందిన రవి గౌడ్, కేసీఆర్ ఆరోగ్య స్థితిని టీవీల్లో వీక్షించి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వరంగల్‌కు చెందిన సుధాకర్ తెలంగాణాకు మద్దతుగా తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో తెలంగాణాకోసం మృతి చెందినవారి సంఖ్య 22కి చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu