తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఉండే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. శనివారం ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై స్పందించకపోతే పార్టీలకతీతంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేయడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న ప్రతి ఉద్యోగికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరో ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా తాము కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దేశంలోనే కాదు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇంత శాంతియుతంగా ఉద్యమం సాగిన దాఖలాలు లేవన్నారు. ఉద్యమం ఉధృత రూపం దాల్చక ముందే కేంద్ర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.