Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోదు : ఎంపీ ఉండవల్లి

తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోదు : ఎంపీ ఉండవల్లి
, శనివారం, 10 డిశెంబరు 2011 (14:54 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలన్నారు.

పార్లమెంట్‌ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. చిన్న జిల్లాల ఏర్పాటుకు, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడిస్తుందని చెప్పారు.

ఇకపోతే.. అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. ఇదే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారని, వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఉండవల్లి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu