Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్కలిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: వైఎస్.జగన్

టెక్కలిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: వైఎస్.జగన్
, మంగళవారం, 8 సెప్టెంబరు 2009 (13:07 IST)
టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భారతమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు టెక్కలి ప్రజలు చేయూతనివ్వాలన్నారు.

ఇందుకోసం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లోనే కాకుండా వచ్చే 2014లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్టీకి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్ కోరికను ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు.

కోటాను కోట్ల ప్రజల ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పేదల ఆకలి తీర్చేందుకే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని వైఎస్ ప్రవేశపెట్టారన్నారు. అలాగే, ఉత్తరాంధ్ర అభివృద్ధికి తన తండ్రి ఎనలేని కృషి చేశారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా స్పీకారం చుట్టారని గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu