Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీకి మూడో స్థానమే - చిరుకు రాజ్యసభ : బొత్స జోస్యం

టీడీపీకి మూడో స్థానమే - చిరుకు రాజ్యసభ : బొత్స జోస్యం
, శుక్రవారం, 9 మార్చి 2012 (19:18 IST)
File
FILE
ఈనెల 18వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితం కానుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కష్టసాధ్యమే అయినప్పటికీ.. కొన్ని సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని చెప్పారు.

ఆయన న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ గులాం న‌బీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. అనంతరం మాట్లాడుతూ... తమ అభిప్రాయం అధిష్టానికి విన్నవించామ‌ని తెలిపారు.

నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంద‌న్నారు. చిరంజీవికి రాజ్యస‌భ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. త‌మ పార్టీని న‌మ్మి త‌మ వ‌ద్దకు వచ్చిన వారిని త‌మ అధిష్టానం విస్మరించ‌ద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే, తమను వ్యతిరేకించే ఎవరైనా సరే వారు తమకు ప్రత్యర్థులేనన్నారు.

Share this Story:

Follow Webdunia telugu