Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైపాల్ రెడ్డి : తెలంగాణపై సోనియా నిర్ణయం శిలాశాసనం!

జైపాల్ రెడ్డి : తెలంగాణపై సోనియా నిర్ణయం శిలాశాసనం!
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డారు. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉంటూ అలా మాట్లాడుకూడదని హితవు పలికారు.

ముఖ్యమంత్రికి ఇలా హిత వచనాలు చెపుతూనే... సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం అర్థం లేనిదని కొట్టిపారేశారు. తెలంగాణపై సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనం అనీ, ఎన్ని జరిగినా అది అమలు జరిగి తీరుతుందని చెప్పారు.

అంతకుముందు డీఎస్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహలు సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీలో తనకు ఉన్న అభ్యంతరాలను లేవనెత్తకుండా ఇక్కడ ఓ కుట్రదారుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu