Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ : సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ ఉల్లంఘించింది!

జగన్ : సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ ఉల్లంఘించింది!
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ ఉల్లంఘించిందని మెమోలో తెలిపారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జైలులో ఉన్న జగన్ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.

సీబీఐ ఐదో ఛార్జిషీట్‌పై ఆయన ఈ మెమో దాఖలు చేయడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీబీఐ ఐదో ఛార్జీషీట్‌ దాఖలు చేసిందని జగన్ మెమోలో వెల్లడించారు.

ఏడు అంశాలపై దర్యాప్తుచేసి తుది ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపిందని, కానీ ఇప్పుడు ఒకే అంశంపై ఛార్జీషీట్ దాఖలు చేసిందని జగన్ మెమోలో వివరించారు. దీన్నే తుది ఛార్జిషీట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని జగన్ మెమో ద్వారా కోరారు. మరోవైపు విజయసాయి రెడ్డి కూడా మెమో దాఖలు చేశారు. కాగా జగన్‌ను సీబీఐ గురువారం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu