జగన్ - విజయమ్మలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు గుడ్బై!
, శనివారం, 10 ఆగస్టు 2013 (12:59 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. కడప లోక్సభ స్థానానికి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయగా, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ అధికారికంగా శనివారం సాయంత్రం వెల్లడించనుంది.