Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ మోహన్ రెడ్డి : బెయిల్ రాలేదు... మెతుకు ముట్టలేదట!

జగన్ మోహన్ రెడ్డి : బెయిల్ రాలేదు... మెతుకు ముట్టలేదట!
, శుక్రవారం, 10 మే 2013 (19:05 IST)
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే జగన్ మెతుకు ముట్టలేదట. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్.. గురువారం మధ్యాహ్నం వరకు ఎంతో చలాకీగా కన్పించారట.

అయితే బెయిల్ పిటిషిన్ కొట్టివేస్తూ గురువారం సుప్రీం తీర్పు వెలువరించిన వెంటనే తన బ్యారక్‌లోకి వెళ్ళి ఒంటరితనాన్ని ఆశ్రయించి, ఇతర వీఐపీ ఖైదీలనూ దూరంగా ఉంచినట్టు సమాచారం. అంతేగాకుండా, భోజనం సైతం స్వీకరించలేదట.

ఆశ నిరాశ అయితే, నిస్పృహ పతాకస్థాయికి చేరితే ఎవరైనా ఏం చేస్తారు? మనస్తాపం చెంది, ఆ బాధను ఏ భోజనం మీదనో చూపిస్తారు. అందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మినహాయింపు కాదు కదా..!

Share this Story:

Follow Webdunia telugu