Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడిచేవాళ్లం: శైలజానాథ్

జగన్ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడిచేవాళ్లం: శైలజానాథ్
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్సార్ అనుచరులుగా ఆయన వెంటే నడిచేవాళ్లమని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేయడంతో ఆయన వెంట ఉండేది లేదని శైలజానాథ్ స్పష్టం చేశారు.

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా వ్యతిరేకంగా తాను కార్యకలాపాలు కొనసాగించినట్లు వచ్చిన వార్తల్ని శైలజానాథ్ ఈ సందర్భంగా ఖండించారు. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి పదవి అడిగానే తప్ప వేరొక కారణం లేదన్నారు.

వాస్తవానికి ఎస్సీలకు 8 పదవులు రావాల్సి ఉండగా, అది ఆరుకే పరిమితమైందని శైలజానాథ్ చెప్పారు. కాగా.. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్, జేసీ దివాకర్ రెడ్డిలలో సీనియర్ శాసనసభ్యుడైన జేసీకి మంత్రి పదవి దక్కలేదు.

Share this Story:

Follow Webdunia telugu