Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌‌ను ఓదార్చే రోజు త్వరలో వస్తుంది: చంద్రబాబు

జగన్‌‌ను ఓదార్చే రోజు త్వరలో వస్తుంది: చంద్రబాబు
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (15:56 IST)
File
FILE
ఎడతెగని ఓదార్పు యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఓదార్చే రోజు త్వరలో వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒకవ్యక్తి వల్ల ఇంతమంది అధికారులు జైలుకెళ్తుంటే ఆ వ్యక్తి సిగ్గుపడాలని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ యువతరంగం సదస్సు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొండలు పిండి చేయగల శక్తి యువతకే ఉందని, అందుకే పార్టీలో యువకుల పాత్ర ఎక్కువగా పెంచామన్నారు. కాగా యువతరం రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో మాఫియా పాలన రాజ్యమేలుతోందని, కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందని బాబు ధ్వజమెత్తారు. కాగా తమకు భయపడే ప్రభుత్వం పోలవరం టెండర్లు రద్దు చేసిందని ఆయన అన్నారు. ఇంకా మద్యం సిండికేట్లలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu