Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ను సీఎం చేస్తే మీ సమస్యలు పరిష్కారం : విజయమ్మ

జగన్‌ను సీఎం చేస్తే మీ సమస్యలు పరిష్కారం : విజయమ్మ
, బుధవారం, 7 నవంబరు 2012 (13:12 IST)
File
FILE
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

నీలం తుఫాను బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి, రైతులు, వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె వారినుద్దేశించి ప్రసంగిస్తూ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. అపుడే రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

గోదావరి ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌కు తాను వివరిస్తానని, నష్టపరిహారం అందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డెల్టా ఆధునికీకరణ పూర్తిచేయనందునే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉంటే ఆధునికీకరణ పనులు పూర్తి చేయించేవారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu