Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ను ఏకాకిని చేసేందుకు టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు : వైకాపా

జగన్‌ను ఏకాకిని చేసేందుకు టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు : వైకాపా
, సోమవారం, 10 సెప్టెంబరు 2012 (18:51 IST)
File
FILE
రాష్ట్ర రాజకీయాల్లో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఏకాకిని చేసేందుకు అధికార విపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆమె సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రధానితో చంద్రబాబుకు రహస్యంగా చర్చలు జరపడం మొదటి నుంచి అలవాటేనని ఆరోపించారు.

జగన్‌ను ఎదిరించాలంటే కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వచ్చారన్న విషయం తేలిపోయిందన్నారు. మీడియాను అడ్డంపెట్టుకుని కుళ్లురాజకీయాలు చేసేది టీడీపీ నేతలేనని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu