Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబూ.. పదివేల మంది పొట్టకొట్టొద్దు: శైలజానాథ్

చంద్రబాబూ.. పదివేల మంది పొట్టకొట్టొద్దు: శైలజానాథ్
, బుధవారం, 10 మార్చి 2010 (15:32 IST)
బ్రహ్మణి స్టీల్ కంపెనీలో పది వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని వారి కడుపు కొట్టవద్దని ప్రభుత్వ విప్ శైలజానాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ప్రభుత్వం భూమి, నీటిని కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదే అంశాన్ని బుధవారం అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో లేవనెత్తి, ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.

దీంతో శైలజానాథ్ కల్పించుకుని బ్రహ్మణి స్టీల్ కంపెనీ రాయలసీమ ప్రాంతంలో పదివేల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అసెంబ్లీని వేదికగా చేసుకుని చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. బ్రహ్మణి అంశాన్ని ఇప్పటికే పలుమార్లు సభలో లేవనెత్తారని, ఆయన విమర్శలకు ధీటుగానే ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చిందని శైలజానాథ్ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu