Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణేశ్ నిమజ్జనం: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌కి 40వేల విగ్రహాలు

గణేశ్ నిమజ్జనం: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌కి 40వేల విగ్రహాలు
, శనివారం, 10 సెప్టెంబరు 2011 (18:33 IST)
WD

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గణేశ్ నిమజ్జన కార్యక్రమం కోలాహలం మొదలైంది. నగరంలోని ట్యాంక్ బండ్ కు సుమారు 40 వేల విగ్రహాలకు పైగా నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులకు ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా డీజీపి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో పేలుళ్ల నేపధ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

గణేశ్ విగ్రహాలను ప్రధాన ఊరేగింపుగా బయలుదేరే మార్గం కేశవగిరి, చాంద్రయణగుట్ట, ఫలక్ నుమా, ఛార్మినార్, మదీనా, అప్జల్ గంజ్, అబిడ్స్, బషీరాబాగ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కి బ్యారికేడ్లు వేస్తున్నారు.

అయితే ఈ మార్గాన్ని దాటి వెళ్లేందుకు వీలుగా తూర్పు వైపు నుంచి పశ్చిమానికి వాహనాలు ప్రయాణించేందుకు బషీరా బాగ్ జంక్షన్ వద్ద మార్గాన్ని దాటేందుకు సదుపాయం కల్పించారు. ఇంకా నగరంలోని పలు ప్రధానమైన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Share this Story:

Follow Webdunia telugu