Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్-జగన్ వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది : చంద్రబాబు

కేసీఆర్-జగన్ వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది : చంద్రబాబు
, శనివారం, 9 జూన్ 2012 (13:22 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిల వల్ల రాష్ట్రం అధోగతి పాలుకావడమే కాకుండా, రాష్ట్రం పరువు పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన శనివారం రాజమండ్రిలో మాట్లాడుతూ... గుంటురు జిల్లా పత్తిపాడులో తనపై కోడిగుడ్లతో దాడి జరగడం సిగ్గుచేటన్నారు. తన 35 యేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందన్నారు.

జగన్, కేసీఆర్ కుట్రల వల్లనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పనని, మీరే చూస్తారు కదా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇకపోతే.. రాష్ట్ర మంత్రివర్గంలో పలువురు మంత్రులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారన్నారు. ఇలాంటి మంత్రులకు క్లీన్ చిట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో సీబీఐ, ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు బలహీనంగా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu