Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేజీ బేసిన్ వాటా కోసం ప్రజారాజ్యం ధర్నా

కేజీ బేసిన్ వాటా కోసం ప్రజారాజ్యం ధర్నా
, గురువారం, 13 ఆగస్టు 2009 (16:41 IST)
File
FILE
కేజీ బేసిన్‌లో రాష్ట్ర వాటాను కేటాయించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 18వ తేదీన ప్రజారాజ్యం పార్టీ ధర్నా నిర్వహించనుంది. ఈ విషయంపై ఆ పార్టీ ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, శ్రావణ్‌లు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను జాతీయం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఈనెల 18వ తేదీన ధర్నా చేయనున్నట్టు చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లాలోని గ్యాస్ ప్లాంట్ వద్ద జరిగే ఈ ధర్నాలో చిరంజీవి పాల్గొంటారని వారు తెలిపారు. మరోవైపు ఈ నెల 26వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు చెప్పారు.

ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత భారీ ఎత్తున ఒక ఉత్సవంలా నిర్వహించరాదని నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu