Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌ అధిష్టానంపై కోపం లేదు: పురంధేశ్వరి

కాంగ్రెస్‌ అధిష్టానంపై కోపం లేదు: పురంధేశ్వరి
కాంగ్రెస్ అధిష్టానం తనకు విశాఖపట్నం లోక్‌సభ కేటాయించడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు జరిపేటప్పుడు ఒక్కోసారి కోరుకున్న స్థానాలు లభించకపోవడం అన్నది సహజమేనని ఆమె అన్నారు.

విశాఖకు చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధిష్టానాన్ని తొలుత తాను బాపట్ల సీటు కేటాయించాల్సిందిగా కోరినమాట నిజమేనని అన్నారు. అంతమాత్రాన ఇప్పుడు కేటాయించిన విశాఖ సీటుపై తాను విముఖత చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. అలాగే తాను విశాఖ సీటుపై విముఖత చూపుతున్నట్టు వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు.

విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తాను భవిష్యత్‌లో ఇక్కడి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. విశాఖ లోక్‌సభ స్థానానికి ఆమె సోమవారం నామినేషన్ సమర్పించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu