Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడతాం: పొన్నం

ఆ విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడతాం: పొన్నం
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడుతామని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.

తెలంగాణపై చర్చించేందుకు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అనంతరం పొన్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

అలాగే బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వాద్దా అనే విషయంపై వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu