Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది జరిగివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేది: షబ్బీర్ అలీ

అది జరిగివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేది: షబ్బీర్ అలీ
, మంగళవారం, 22 జులై 2014 (18:06 IST)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ కృషేనంటూ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సభ నిర్వహించివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఆలస్యం కావడంతో ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లిందని అన్నారు. టీఆర్ఎస్‌ మాదిరిగా రుణమాఫీ పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టకపోవడం దెబ్బతీసిందని పేర్కొన్నారు. 
 
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజే విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలలైనా ఇంకా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu