బాహుబలి మేకర్ రాజమౌళి హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆకాంక్షతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ను నిర్మించారు.
దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టే ఖర్చులో సగాన్ని తుపాను బాధితులకు ఇవ్వాలని ఈ ఫిల్మ్లో రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేయాలనే మెసేజ్ ఇందులో ఉంది.
"సగం దీపాలను మన హృదయాల్లో వెలిగిద్దాం... ఆ వెలుగును విశాఖ కళ్లలో చూస్తాం... పండుగ చేసుకుందాం"అంటూ ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ మెసేజ్కు హీరో రాణా వాయిస్ వినిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్కు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.