ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కీచకపర్వం చోటుచేసుకుంది. తిరుపతి పట్టణంలోని జాతీయ సంస్కృత యూనివర్శిటీలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వర్శిటీకి చెందిన ఇద్దరు ఆచార్యులు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక ఆచార్యుడు అత్యాచారం చేస్తుంటే మరో ఆచార్యాడు వీడియో తీశాడు. ఈ దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తంతు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు పొక్కగానే ఒక ప్రొఫెసర్పై వర్శిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినిపై ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డికి తన ఫోనులో చిత్రీకరించాడు. అనతంరం ఆ వీడియోను చూపించి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
ఈ వేధింపులను భరించలేని బాధితురాలు 10 రోజుల క్రితం వర్శిటీ వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఆమె ఫిర్యాదుతో యూనివర్శిటీ అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. అలాగే, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి, లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఈ నెల ఒకటో తేదీన వర్శిటీ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఘటనపై పూర్తి ఆధారాలతో వర్శిటీ ఇన్చార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు ప్రొఫెసర్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సింక్ ల్యాబ్కు పంపించినట్టు సీఐ మురళీ మోహన్ తెలిపారు. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కీచక ప్రొఫెసర్ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.