Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

సెల్వి
మంగళవారం, 2 డిశెంబరు 2025 (14:55 IST)
టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో మొథా తుఫాను వల్ల జరిగిన నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,109 గ్రామాలపై తుఫాను ప్రభావం చూపిందని, వివిధ రంగాలలో రూ.6,356 కోట్ల నష్టం వాటిల్లిందని లోకేష్ పేర్కొన్నారు. 
 
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అందించారు. ఇటీవల మొంథా తుపానుతో పంట నష్టం ఎక్కువగా జరిగింది. వరద నష్టం అంచనాల కోసం కేంద్ర కమిటీ వచ్చి పరిశీలన చేసి వెళ్లింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో  ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత సమక్షంలో ఈ నివేదికను సమర్పించినట్లు నారా లోకేష్ తెలిపారు. 
 
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ సహాయంగా రాష్ట్రం రూ.902 కోట్లు కోరుతున్నట్లు లోకేష్ తెలిపారు. సమావేశంలో పలువురు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments