Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ రూ-5, 1 kg బియ్యం రూ.1కి ఏంటి? : ఎంపీ జేసీ దివాకర్ క్వచ్చన్

టీ రూ-5, 1 kg బియ్యం రూ.1కి ఏంటి? : ఎంపీ జేసీ దివాకర్ క్వచ్చన్
, ఆదివారం, 29 నవంబరు 2015 (19:02 IST)
ఒక టీ ఐదు రూపాయలకు అమ్ముతున్న ప్రస్తుత తరుణంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ టీ తాగేందుకు రూ.5 వెచ్చిస్తున్నారు. అలాంటపుడు కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. 
 
రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా తగ్గాలని అభిప్రాయపడ్డ ఆయన, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంపై, జేసీ వ్యాఖ్యలకు ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu