Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి పీపుల్స్ రాజధాని ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ...

అమరావతి పీపుల్స్ రాజధాని ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ...
, శనివారం, 10 అక్టోబరు 2015 (16:45 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఆహ్వానం పత్రికను శనివారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో మంత్రులకు, అధికారులకు కూడా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేపటి నుంచే శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రాలు ఇచ్చి, పలువురిని ఆహ్వానించనున్నారు.
 
 
ఈ ఆహ్వాన పత్రికను చాలా సింపుల్‌గా, ఎంతో ఆకర్షణీయంగా ముద్రించారు. ఇందులో తొలుత చంద్రబాబు నాయుడు పేరు ఉండగా, ఆతర్వాత అమరావతి పీపుల్స్ రాజధాని, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పేర్లు ఉన్నాయి. చివరి పేజీలో ఏపీ ముఖ్యమంత్రి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అనే ముద్రించారు. 

Share this Story:

Follow Webdunia telugu