ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ నెలాఖరులో సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెల్సిందే. మొత్తం వారం రోజుల పాటు సింగపూర్లో పర్యటించే ఆయన వెంట ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా వెళ్లనున్నారు. ఇందుకోసం చంద్రబాబు శుక్రవారం ప్రత్యేకమైన పాస్ పోర్టును పొందారు.
శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును కార్యాలయ నిర్వహణాధికారిణి అశ్విని సత్తారు, డిప్యూటీ పాస్ పోర్టు అధికారి మదన్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత చంద్రబాబు రావడానికి గల కారణాలు తెలుసుకుని కేవలం 10 నిమిషాల వ్యవధిలో డిప్లొమేటిక్ పాస్పోర్టు సిద్ధం చేయించి అందజేశారు. కాగా, ఈతరహా పాస్పోర్టు ఉన్నవారిని విదేశాల్లో ఎక్కడా తనిఖీలు చేయరు.