Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

Advertiesment
pinipe vishwaroop

ఠాగూర్

, శుక్రవారం, 18 జులై 2025 (17:06 IST)
ఏపీలో అధికారం మారినప్పటికీ వైకాపా నేతల బెదిరింపులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ.. వైకాపా నేతలు మాత్రం తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా మాజీ మంత్రి  పినిపే విశ్వరూప్ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నేను ఎక్కడున్నా.. నిన్ను మాత్రం వదలను. నీ అంతు చూస్తా. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా. వీఆర్‌‍కు పంపిస్తా అంటూ అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్ కుమార్‌ను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. 
 
ఇటీవల వైకాపా అల్లవరం మండలం అధ్యక్షుడు బాపూజీ కుమారుడిపై ఆకారణంగా కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై వైకాపా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, 'సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశ్వరూప్ కొత్తపేట సబ్ జైలుకు రిమాండ్‌కు పంపించారని విశ్వరూప్ ఆరోపించారు. "ఈ ఐదేళ్ల కాలంలో మంత్రి కోసమో, ఎమ్మెల్యే కోసమో పనిచేసుకో. కానీ ఆకారణంగా వైసీపీ కార్యకర్తలపై వేధింపులకు దిగి కేసులు పెడితే నీతో ఊచలు లెక్కపె ట్టిస్తా" అంటూ హెచ్చరించారు.
 
ఒక పక్షానికి అనుకూలంగా పనిచేసి తమ కార్యకర్త వేధింపులకు గురిచేయవద్దని, పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగే పరిస్థితులు తేవద్దని హితవు పలికారు. సీఐపై విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ. ఇటు పోలీసు వర్గాల్లోనూ తీవ్రచర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు